Home South Zone Andhra Pradesh రూ.14 కోట్ల విలువైన యువ ప్రతిభకు సిద్ధమైన కొత్త తరం |

రూ.14 కోట్ల విలువైన యువ ప్రతిభకు సిద్ధమైన కొత్త తరం |

0

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీ అనే 14 ఏళ్ల కుర్రాడిని రూ. 1.10 కోట్లకు దక్కించుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ లాగే తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించబోతున్న మరో ముగ్గురు యువ ఆటగాళ్ల గురించి చర్చ మొదలైంది.

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీ అనే 14 ఏళ్ల కుర్రాడిని రూ. 1.10 కోట్లకు దక్కించుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ లాగే తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించబోతున్న మరో ముగ్గురు యువ ఆటగాళ్ల గురించి చర్చ మొదలైంది. ఆ ముగ్గురు యువ కిశోరాలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ప్రశాంత్ వీర్ (Prashant Veer) – రూ. 14.20 కోట్లు..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ‘అన్‌క్యాప్‌డ్’ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని) ఆటగాడిగా ప్రశాంత్ వీర్ రికార్డు సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇతని కోసం ఏకంగా రూ. 14.20 కోట్లు వెచ్చించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లోయర్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించగల ఆల్ రౌండర్. వైభవ్ సూర్యవంశీ లాగే ఇతను కూడా ఈ సీజన్‌లో ‘ఎక్స్-ఫ్యాక్టర్’ అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
కార్తీక్ శర్మ (Kartik Sharma) – రూ. 14.20 కోట్లు..
చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్‌తో పాటు సమానమైన ధరకు (రూ. 14.20 కోట్లు) దక్కించుకున్న మరో ఆటగాడు కార్తీక్ శర్మ. రాజస్థాన్‌కు చెందిన ఈ 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్, దేశవాళీ క్రికెట్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎంఎస్ ధోనీ మార్గదర్శకత్వంలో కార్తీక్ శర్మ ఐపీఎల్ 2026లో మరో వైభవ్ సూర్యవంశీలా మెరుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మంగేష్ యాదవ్ (Mangesh Yadav) – రూ. 5.20 కోట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన యువ ఆటగాడు మంగేష్ యాదవ్. మహారాష్ట్రకు చెందిన ఈ 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, 145 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో బంతులు విసరగలడు. గత సీజన్‌లో నెట్ బౌలర్‌గా ఉన్న ఇతను, ఈసారి మెయిన్ టీమ్‌లోకి వచ్చాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో ఎలాగైతే సంచలనం రేపాడో, మంగేష్ తన వేగంతో బౌలింగ్‌లో అదే స్థాయి గుర్తింపు తెచ్చుకుంటాడని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నమ్ముతోంది.
ఐపీఎల్ ఎప్పుడూ కొత్త ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే రికార్డులు సృష్టించగా, ప్రశాంత్, కార్తీక్, మంగేష్ వంటి యువకులు తమ ప్రదర్శనతో 2026 సీజన్ కింగ్స్ అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

#Sivanagendra

NO COMMENTS

Exit mobile version