Home South Zone Andhra Pradesh మేజర్ బ్రెయిన్ ఆధునీకరణ పనులకు వర్చువల్ శంకుస్థాపన

మేజర్ బ్రెయిన్ ఆధునీకరణ పనులకు వర్చువల్ శంకుస్థాపన

0

• డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

• ⁠మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు. శంకర గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు.

• కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం.

• రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రివర్యులు. 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

NO COMMENTS

Exit mobile version