Tuesday, December 30, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమేజర్ బ్రెయిన్ ఆధునీకరణ పనులకు వర్చువల్ శంకుస్థాపన

మేజర్ బ్రెయిన్ ఆధునీకరణ పనులకు వర్చువల్ శంకుస్థాపన

• డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

• ⁠మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు. శంకర గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు.

• కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం.

• రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రివర్యులు. 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments