Home South Zone Andhra Pradesh అయ్యప్ప స్వామి దర్శించుకున్న జడ్పీ చైర్మన్

అయ్యప్ప స్వామి దర్శించుకున్న జడ్పీ చైర్మన్

0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారి పల్లి కోటమలై అయ్యప్ప స్వామి ఆలయాన్ని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు శనివారం సందర్శించారు.

అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన ఇరుముడితో 18 మెట్ల గుండా స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించారు. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనం అనంతరం ఆలయ పండితులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

#కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version