తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్నప్రసాదం అందిస్తున్న తీరు అద్భుతమని ఆయన ప్రశంసించారు.
అన్నప్రసాదం రుచికరంగా ఉందని, ఇంత భారీ స్థాయిలో భోజన సౌకర్యం కల్పించడం గొప్ప విషయమని భారత్పై ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది




