మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి పైరసీ సెగ తగిలింది. సినిమా థియేటర్లో విడుదలైన 24 గంటల్లోనే ఆన్లైన్లో HD ప్రింట్ విడుదలైంది.
ఈ పైరసీ వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
