ఆరోగ్య హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి, కుటుంబ సభ్యుల ఆరోపణలు
మంచిర్యాల జిల్లాలోని ఒక ప్రైవేట్ హాస్పటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వాడ్లూరి శ్రీనివాస్ (54) అనే వ్యక్తి మృతి చెందాడు. నాలుగు నెలల క్రితం కాలుకు గాయంతో చేరిన శ్రీనివాస్కు నాలుగుసార్లు ఆపరేషన్లు చేసినా, సరైన చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
చికిత్సకు రూ. 4-5 లక్షలు ఖర్చయినా, మరో లక్ష రూపాయలు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. న్యాయం చేయాలని, సంబంధిత డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.