కర్నూలు : కర్నూలు జిల్లాజనవరి 26 వ తేదీ సోమవారం నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం…”రద్దుకర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. జనవరి 26 వ తేది సోమవారం భారత గణతంత్ర దినోత్సవం సంధర్బంగా
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను ” రద్దు చేస్తున్నట్లు కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ గారి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ”
కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని కర్నూల్ ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
