పుంగనూరు పట్టణంలో రోడ్లపై యాచించుకుంటూ జీవనం సాగిస్తున్న దిలావర్ (65) నాగపాళ్యంలో ఒక షాపు వద్ద మంగళవారం రాత్రి మృతి చెందాడు. బుధవారం ఉదయం స్థానికులు యాచకుడు మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పూర్తి వివరాలు విచారణలో వెల్లడవుతాయని తెలిపారు# కొత్తూరు మురళి.




