పుంగనూరు పట్టణంలో షబ్-ఎ-బరాత్ పండుగను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ సుబ్బరాయుడు మంగళవారం సూచించారు. శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడిపినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు పోలీసుల సూచనలను తప్పక పాటించాలని సీఐ తెలిపారు# కొత్తూరు మురళి.
