Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshభారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.

భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం
ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

18 శాతానికి సుంకాల తగ్గింపు గొప్ప నిర్ణయమన్న ముఖ్యమంత్రి
ఒప్పందంతో దేశ ఎగుమతులకు భారీ ఊతం లభిస్తుందని వ్యాఖ్య
ఏపీలోని యువత, రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం
భారత్, అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రక మైలురాయి అని అభివర్ణిస్తూ, ఈ ఒప్పందాన్ని ఖరారు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన అభినందనలు తెలిపారు.

ఈ ఒప్పందంలో భాగంగా సుంకాలను 18 శాతానికి తగ్గించడం ఒక దూరదృష్టితో కూడిన చర్య అని చంద్రబాబు కొనియాడారు. ఈ నిర్ణయం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని చంద్రబాబు ప్రశంసించారు. ఈ ఒప్పందం వల్ల దేశ ఎగుమతి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, తద్వారా యువతకు, రైతులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని యువత, రైతులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments