మదనపల్లి పట్టణంలో మంగళవారం మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరు యువకులు స్కూటర్ను ఢీకొని ఓ యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. తాలూకా ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం
పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు తట్టివారిపల్లి జంక్షన్ వద్ద కారును నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వస్తున్న స్కూటర్ను ఢీకొన్నారు. ఈ ఘటనలో గాయపడిన బాధితుడిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.
