పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతనంగా మంజూరైనటువంటి *మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన మన ప్రియతమ నాయకులు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం రైతాంగం ఎక్కువగా ఉండే ప్రాంతం, పాడి, పంట సమృద్ధిగా ఉంటేనే రైతు బాగుంటారు, రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశాలు బాగుంటాయి.
కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ మినీ గోకులం (పశువుల షెడ్డు) లను పూర్తిగా 100% MGNRGS నిధుల నుండి 25మంది లబ్దిదారులకు 4954000/- రూపాయల వరకు నిధులు మంజూరు చేయటం జరిగింది. పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హతగల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందచేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డెయిరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు, పొన్నూరు నియోజకవర్గ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాదాల వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బండ్లమూడి బాబురావు, గుంటూరు పార్లమెంట్ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి బొర్రు రామారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చలమశెట్టి సీతారామయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తాళ్లూరి వెంకట అప్పారావు, దేశం శెట్టి సూర్య,MPDO గుమ్మడి చంద్రశేఖర రావు, APO సుభాషిణి, APM జోజి బాబు, EOPRD శ్రీనివాస రావు, వివిధ గ్రామాల కూటమి నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




