Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.

రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.

అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ

పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తారా? వైసీపీకి కార్యకర్తలు లేరని అనుకుంటున్నారా? అన్న బొత్స
చంద్రబాబు నాయుడు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని సూచన
రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా చేయాలనుకుంటున్నారా? అంటూ ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తారా? వైసీపీకి కార్యకర్తలు లేరని అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. చంద్రబాబు నాయుడు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని హితవు పలికారు. గత మూడు రోజులుగా కూటమి ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడుల విషయంలో జనసేన, బీజేపీ నాయకులు ఎందుకు తప్పును తప్పు అని చెప్పడం లేదని బొత్స నిలదీశారు. తనను దుర్భాషలాడటం వల్లే రాంబాబు స్పందించారని తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చి తాను మాట్లాడింది తప్పేనని అంగీకరించారని, అయినా కేంద్ర మంత్రి తడాఖా చూపిస్తామని మాట్లాడటం సరికాదన్నారు.

ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను వైసీపీ తెచ్చిందా? అని బొత్స ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని దేవుడు కూడా క్షమించడని, ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందేనని అన్నారు. అంబటి ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేసి చంపాలనుకుంటున్నారా? అంటూ బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వ తీరుపై ప్రజలే ఆలోచన చేయాలని బొత్స కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments