రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్
ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే గేట్ నుంచి గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్వామివారి దర్శనం
కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ నియంత్రణలో పోలీస్ యంత్రాంగం నిస్సహాయ స్థితికి చేరింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.
