Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneTelanganaమంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం వద్ద నామినేషన్ల ఉపసంహరణ గడువు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కృపానందాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యాలయానికి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసినా లోనికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments