తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి సీనియర్ నాయకులు మరియు పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు మాలకార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, ఈశ్వర్ గారు వడెర్రా కార్పొరేషన్ ఛైర్మన్,
ఈశ్వర్ గారు శాతవాహన కార్పొరేషన్ ఛైర్మన్ గారు హాజరై డాక్టర్ శ్రీదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్రీదేవి గారు ప్రజాసేవకు, దళిత వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు చేసిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషి అనేకమందికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ శ్రీదేవి గారి నాయకత్వానికి తమ మద్దతు ప్రకటించారు. భవిష్యత్తులో డాక్టర్ శ్రీదేవి గారు మరింత ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు ఇంకా విస్తృతంగా సేవ చేయాలని పలువురు ఆకాంక్షించారు.
వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలతో ముగిశాయి.




