చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో గురువారం వెలుగు మరియు డిఆర్డిఏ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.
