కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు ఆమె పట్టణానికి చేరుకుంటారు.
దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు రఘువీరా రెడ్డి కూడా హాజరవుతారని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు# కొత్తూరు మురళి.




