పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని కట్టకింద శివాలయంలో గురువారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
మాఘమాసంలోని ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా సూర్యకిరణాలు శివలింగాన్ని తాకాయి. ఈ అద్భుత దృశ్యం దాదాపు 20 నిమిషాల పాటు భక్తులను మంత్రముగ్ధులను చేసిందని ఆలయ అర్చకులు, స్థానికులు తెలిపారు.
ప్రతి సంవత్సరం మాఘమాసం ప్రారంభంలో ఈ దృశ్యం కనిపిస్తుంది# కొత్తూరు మురళి.
