Home South Zone Andhra Pradesh మార్కాపురంలో ఘనంగా రోడ్డు సేఫ్టీ అవగాహన ర్యాలీ |

మార్కాపురంలో ఘనంగా రోడ్డు సేఫ్టీ అవగాహన ర్యాలీ |

0

మార్కాపురంలో ఘనంగా ‘రోడ్ సేఫ్టీ’ అవగాహన ర్యాలీ: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకుందాం.
రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు మార్కాపురం టౌన్ లో ఘనంగా రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో గౌరవనీయులు జాయింట్ కలెక్టర్, మార్కాపురం, ఎస్‌డీపీవో, మార్కాపురం, మార్కాపురం శాసనసభ్యులు, పోలీస్ అధికారులు, పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, వాహన డ్రైవర్లు, సిబ్బంది మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలు, వేగ నియంత్రణ, మొబైల్ ఫోన్ వినియోగం నివారణ వంటి అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

విద్యార్థులు ప్రదర్శించిన నినాదాలు, ప్లకార్డులు ప్రజల్లో మంచి స్పందనను పొందాయి.
అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై స్పష్టత పెరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ ర్యాలీ నిర్వహణలో మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మరియు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

NO COMMENTS

Exit mobile version