Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఆ నమ్మకంతోనే ఏపీకి పెట్టుబడుల వెల్లువ: చింతకాయల విజయ్.

ఆ నమ్మకంతోనే ఏపీకి పెట్టుబడుల వెల్లువ: చింతకాయల విజయ్.

Chintakayala Vijay Says AP Receiving Investment Influx Due to Strong Confidence
దేశంలోనే 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ నెంబర్ వన్ అని వెల్లడి
మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్న విజయ్
గత ప్రభుత్వంతో పోలిస్తే క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని వివరణ

అమరావతి, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌తో రాష్ట్రానికి కొత్త గుర్తింపు అని ఉద్ఘాటన
కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన బలమైన నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దేశవ్యాప్తంగా వచ్చిన సర్వేల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర నాయకత్వం, పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఇది మాటల ప్రచారం కాదని, గణాంకాలే నిదర్శనమని స్పష్టం చేశారు.

దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో సుమారు 25.3 శాతంతో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని, పెట్టుబడుల ఆకర్షణలో ముంబయి, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా అధిగమించిందని విజయ్ వివరించారు. గతంలో భయపడి పారిపోయిన పెట్టుబడిదారులు ఇప్పుడు పోటీపడి రాష్ట్రానికి రావడం కూటమి ప్రభుత్వంపై విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఈ అభివృద్ధి కారణంగానే గత ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో తలసరి ఆదాయం 12 శాతం పెరిగిందని తెలిపారు. పరిశ్రమలు, ఉద్యోగాలు పెరిగితేనే ఇది సాధ్యమని, ఇది కూటమి పాలన ఫలితమేనని అన్నారు.

ఉద్యోగాల కల్పన విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని విజయ్ తెలిపారు. మాటల్లో కాకుండా చేతల్లో ఉద్యోగాలు చూపించిన నాయకత్వం తమదని, గత పాలనలో నిరుద్యోగులను మోసం చేసిన పరిస్థితి ఇప్పుడు లేదన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments