కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లి గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో రైతు జరిపిటి సురేంద్ర (59)పై అదే గ్రామానికి చెందిన రమణ, మహేశ్, మహేంద్ర వర్గీయులు గురువారం అర్ధరాత్రి కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
ఈ దాడిలో సురేంద్రకు తీవ్ర గాయాలై, రెండు చేతులు విరిగినట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు అతన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
