అన్నమయ్య జిల్లా బోయకొండ పరిసరాల్లోని వీకే రెసిడెన్సీ వెనుక రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందెంపై డీఎస్పీ మహేంద్ర నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం దాడి చేసింది.
డ్రోన్ కెమెరా సహాయంతో పందెం ఆడుతున్న 13 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆరు కోళ్లు, రూ. 25,000 నగదు, 11 వాహనాలు, 13 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపా.




