మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా DM&HOకి ఘాటైన ఫిర్యాదు అందజేశారు. అర్థరాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు అని చూడకుండా వార్డుల నుంచి బయటకు పంపడం దారుణమని, గతంలో చలికి ఓ మహిళ మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలకు డిమాండ్
RELATED ARTICLES




