Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమానవత్వం చాటుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

మానవత్వం చాటుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు
దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు
గతంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సందర్భంగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డాక్టర్లు ఈ ఆసుపత్రిలో మార్చురీ గది లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి దృష్టికి తీసుకువచ్చారు.ఒక వైద్యురాలిగా అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించిన డాక్టర్ లక్ష్మీ గారు, మానవత్వంతో స్పందించి మరణించిన వారికి గౌరవం కలిగే విధంగా పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రత్యేక గది అవసరం అని భావించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి దాదాపు ₹30 లక్షల వ్యయంతో నూతన మార్చురీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.
శనివారం సాయంత్రం ఆసుపత్రి ప్రాంగణంలో మార్చురీ గది ఎక్కడ నిర్మించాలన్న విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ గారితో కలిసి స్థల పరిశీలన, చర్చలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య,
హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్, సంఘ సేవకులు జి.వి. రత్నం, మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి కోటయ్య,
క్లస్టర్ నారపుశెట్టి మధు, ఊరిబిండి మధు, బెల్లా శ్రీను,
స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments