మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్లో ఆదివారం ఇద్దరు మహిళలు పరస్పరం మోసం చేశారంటూ రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. చిప్పిలికి చెందిన లక్ష్మీసుకన్య, అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న రాజేశ్వరి తన వద్ద చీటీలు కట్టించానని, తనకు సంబంధించిన సుమారు రూ. 1. 20 కోట్లను ఇవ్వకుండా రాజేశ్వరి మోసం చేసిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా రాజేశ్వరి కూడా తననే లక్ష్మీసుకన్య మోసం చేసిందంటూ ఆరోపణలు చేశారు. ఘటనపై స్పష్టత రావాల్సి ఉండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
