Home South Zone Andhra Pradesh పాఠశాలల్లో 5-8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పాఠశాలల్లో 5-8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

0

వేటపాలెం: 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన వర్గాల గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 4వ తేదీ తుది గడువుగా నిర్ణయించినట్లు వేటపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మహ్మద్ నహీదా  ఒక ప్రకటనలో తెలిపారు.వేటపాలెం కేంద్రంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలు వేటపాలెం, యర్రగొండపాలెం, కొండేపి ప్రాంతాల్లో ఉండగా, బాలికల పాఠశాలలు టంగుటూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు 04-03-2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. మొత్తం 6 గురుకులb పాఠశాలల్లో 5వ తరగతికి 380 ఖాళీలు, అలాగే 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు 260 ఉన్నట్లు తెలిపారు.ప్రవేశాల కోసం నిర్వహించే పోటీ పరీక్ష ఏప్రిల్ నెలలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, వేటపాలెం నందు జరుగుతుందని వెల్లడించారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version