పాలేరు నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వైన్స్లలో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపుల్లో నిల్వ ఉండటం గమనార్హం. నిర్వాహకులు సిండికేట్గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తూ, గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలిస్తున్నారు. అక్కడ MRP కంటే రూ.30 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తూ సామాన్యుల జేబులకు గండి కొడుతున్నారని, ఈ దోపిడీని అరికట్టాలని మందుబాబులు కోరుతున్నారు.
