అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్ను అడ్డుకున్నారు. మదనపల్లె–తిరుపతి రహదారిలో నంబర్ లేని లగేజీ ఆటోను తనిఖీ చేయగా, ఉల్లి బస్తాల కింద దాచిన 179 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 44.65 లక్షలు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు
