మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల తుర్కపల్లి లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. స్థానిక ప్రజల చిరకాల వాంఛ అయిన భూగర్భ మురుగు నీటి పారుదల (సివరేజ్) సమస్యకు పరిష్కారం లభించింది.
మంగళవారం నాడు133 డివిజన్ కార్పొరేటర్ జితేంద్రనాథ్ తుర్కపల్లి లో పర్యటించి రూ. 4.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన సివరేజ్ పైపులైన నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. గతంలో ఈ బస్తీలో మైనంపల్లి హనుమంతరావు తన సొంత నిధులతో రోడ్డు పనులు, విద్యుతీకరణ లాంటి అభివృద్ధి పనులను చేయించడం జరిగిందని ఆయన తెలిపారు. డివిజన్ లోని ప్రతి బస్తీలో మౌలిక సదుపాయాల కల్పనే తన జీవని తెలిపారు. నాన్యతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తమ ప్రాంతంలో చివరి పనులు ప్రారంభించినందుకు స్థానికులు రాజ్ జితేంద్రనాథ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
#sidhumaroju
Alwal



