ఈరోజు అనగా 11-2-2026 న ఉదయం 11 గంటలకు ఆంధ్ర రత్న భవన్ పార్టీ ఆఫీసు నందు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబ గారి ఆదేశాల మేరకు శ్రీమతి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రేట్రీ ఇంచార్జ్ శ్రీమతి కమలాక్షి గారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రేట్రీ ఇన్చార్జి శ్రీమతి ఆదితా గారు ఆదేశాలతో ఈరోజు ఉదయం 11 గంటలకు మహిళా కాంగ్రెస్ సమావేశం చేపట్టడం జరిగింది.
ఈ సమావేశంలో ఆదిత గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. అమర్ జహా బేగ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి.
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపిక మరియు స్టేట్ మహిళా కాంగ్రెస్ బాడీ ఏదైతే ఉందో పూర్తి చేయాలని మరియు ఎవరైతే మహిళా కాంగ్రెస్లో కష్టపడి పని చేస్తున్నారో వారిని గుర్తించి వారిని సముచిత స్థానం కల్పించి అడుగులు వేయాలని అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మరియు మల్లికార్జున ఖర్గే గారు చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే చట్టాన్ని బిజెపి తొలగించి వి బి జి రాంజీ అనే కొత్త చట్టాన్ని తెచ్చిపెట్టిందో దాని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి
మనం దానిమీద మహిళా కాంగ్రెస్ తరపున పోరాడాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రేట్రీ ఇన్చార్జి అదిత గారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు త్వరలోనే మహిళా కాంగ్రెస్ కమిటీ కంప్లీట్ బాడీ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల నియమాకం జరుగుతుందని చెప్పటం జరిగింది
