అన్నమయ్య జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ రమేష్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన ఆయనకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య ఈ కీలక బాధ్యతలను అప్పగించారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ రమేష్ బాబు, జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని, ఆరోగ్య పథకాల అమలులో అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
