పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది.
తమ్ముడు నాగరాజు వేటకొడవలితో అక్క గంగులమ్మపై దాడి చేయడంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది.
బాధితురాలిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజును కొలింపల్లి బస్స్టాప్ వద్ద అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరిచారు కొత్తూరు మురళి.
