మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మండల స్థాయి నేతల శిక్షణలో దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
“సూపర్ సిక్స్” పథకాలైన ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ వంటి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ, ప్రభుత్వం మరియు ప్రజల మధ్య కార్యకర్తలు వారధిగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.




