కేంద్ర బడ్జెట్ 2026-27 నిధులను గరిష్టంగా సాధించేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు పక్కా కార్యాచరణ దిశానిర్దేశం చేశారు.
అమరావతిలో సెమీకండక్టర్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రాలో రేర్ ఎర్త్ కారిడార్, పల్నాడులో టెక్స్టైల్ పార్కు, తిరుపతిలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్ది, యూసీలు (UCs) సకాలంలో సమర్పించి కేంద్ర పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.




