దొనకొండ మండలంలో సంగాపురం నుండి వీరేపల్లి వరకు కోటి రూపాయల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో ఈ పనులకు శంకుస్థాపన జరిగింది. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు మోడీ ఆంజనేయులు, శివ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.