మదనపల్లిలో స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం భారీ నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం 20 నెలలైనా అమలు చేయలేదని జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి విమర్శించారు.
పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, సీఎం చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుల సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.
