పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలోని చెన్నపట్నం చెరువును శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు సందర్శించారు.
ఈ ఈ నాగార్జున రెడ్డి నేతృత్వంలోని బృందం చెరువు అభివృద్ధి పనులతో పాటు అక్కడ బోటింగ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించింది. దీనిపై త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, చెరువు చైర్మన్ గల్లా బోస్ మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.
