పుంగనూరు పట్టణంలోని కొత్తఇండ్లులో యాక్సిస్ బ్యాంక్ నూతన శాఖ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. డీఎస్పీ మహేంద్ర, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బ్యాంకును ప్రారంభించారు.
స్థానిక ప్రజలకు, వ్యాపారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు మరియు అన్ని రకాల రుణ సదుపాయాలను అందుబాటులోకి తెస్తామని బ్యాంకు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా అధికారులు అతిథులకు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
# కొత్తూరు మురళి .










