మదనపల్లె టమోటా మార్కెట్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ శుక్రవారం 15 కిలోల చిన్న క్రేట్ల ద్వారా ఎగుమతులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ విధానం వల్ల రవాణా సులభతరం కావడమే కాకుండా రైతులకు, వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయని ఆయన తెలిపారు.
ఇందుకోసం మార్కెటింగ్ శాఖ ₹3 కోట్లు విడుదల చేసిందని, రైతులకు రోజువారీ నగదు చెల్లింపులు జరుగుతాయని వెల్లడించారు. మార్చి 2 నుండి ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.




