పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని శివాలయం ఆవరణలో శనివారం ఒక భక్తుడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని, సుమారు రెండు గంటల పాటు శ్రమించి రంగురాళ్లతో (Stones Art) పరమశివుని అద్భుతమైన రూపం వేశారు.
భక్తులు మరియు బాటసారులు ఈ కళాఖండాన్ని చూసి ఆశ్చర్యపోతూ, పరమేశ్వరుడిని దర్శించుకున్నంత అనుభూతి కలుగుతోందని ప్రశంసించారు. ఈ విశేష ఆర్ట్ ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
