ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోమవారం (ఫిబ్రవరి 16, 2026) ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ సచివాలయంలోని RTGS కేంద్రాన్ని సందర్శించి, వ్యవసాయం మరియు ఆరోగ్య రంగాల్లో ఆధునిక సాంకేతికత వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కీలక చర్చలు జరపనున్నారు. విమానాశ్రయం వద్ద ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.










