మదనపల్లెలో రిషిక ప్రియా దారుణ హత్య: ఉద్రిక్తత

0
0

మదనపల్లె నీరుగట్టువారిపల్లిలో రిషిక ప్రియా అనే వ్యక్తి దారుణ హత్యకు గురికావడం మంగళవారం ఉదయం కలకలం రేపింది. ఈ వార్త తెలియగానే కాట్లాటపల్లి రోడ్డు వద్దకు వందలాది మంది స్థానికులు, హిజ్రాలు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

నిందితుడిని తమకు అప్పగించాలని లేదా వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.