మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన గ్రూప్-1 ట్రైనీ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఉద్యోగ బాధ్యతలలో అవినీతికి తావులేకుండా, పారదర్శకమైన సుపరిపాలన అందించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే దేశాభివృద్ధి అని, ప్రజా సేవలో ఆధునిక సాంకేతికతను మరియు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజల్లో అధికారులకు సరైన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.










