చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP.

0
1

మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

2018 దాచేపల్లి ఘటన నుండి నేటి మదనపల్లె వరకు, ఆడబిడ్డల జోలికి వచ్చిన నిందితులు వరుసగా ప్రాణాలు తీసుకోవడం వెనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భయమే ఉందని పేర్కొంది.

తప్పు చేస్తే ఎవరైనా సరే బాబు వదిలిపెట్టరనే వణుకు నిందితులను వెంటాడిందని, అందుకే భయంతో ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ ఈ సందర్భంగా రాసుకొచ్చింది.