ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి

0
0

ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభ్యున్నతికి దాతలు ‘విద్యాంజలి’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సమగ్ర శిక్షా ఏపీసీ డాక్టర్ నున్నా అనూరాధ పిలుపునిచ్చారు.

బసినికొండ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపీనాథ్‌ను ఆమె బుధవారం అభినందించారు.

స్వచ్ఛందంగా సేవలు అందించే వారికి కేంద్ర ప్రభుత్వం ధ్రువపత్రాలు అందజేస్తుందని, సమాజంలోని విద్యావంతులు, దాతలు పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.