మదనపల్లెలో హత్యకు గురైన చిన్నారి రిషిక ప్రియ అంత్యక్రియలకు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, నియోజకవర్గ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు, తెలుగుదేశం పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా పార్టీ ముందుంటుందని వారు ధైర్యం చెప్పారు.
