పల్లెనిద్ర’తో ప్రజలకు చేరువగా పోలీసులు: సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్

0
1

కాకినాడ ఎస్పీ ఆదేశాల మేరకు సామర్లకోట పోలీసులు నవర గ్రామంలో ‘పల్లెనిద్ర’ నిర్వహించారు. సీఐ కృష్ణ భగవాన్ గ్రామస్తులతో కలిసి బస చేస్తూ శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు.

సైబర్ మోసాలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకే ఈ కార్యక్రమమని, యువత చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు.