మంగళంపేట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ మహా సంప్రోక్షణలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమాల అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారికి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
భక్తుల కోలాహలం మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
# కొత్తూరు మురళి.
